ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
పుట్టిన 6 నిమిషాలకే ఆధార్
Published on Sun, 09/24/2017 - 19:25
సాక్షి,ముంబయిః భావనా సంతోష్ జాదవ్ భూమి మీద కొచ్చి కేవలం ఆరే నిమిషాలైనా తన విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ను పొందింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో పాప తల్లితండ్రులు బిడ్డ పుట్టిన వెనువెంటనే ఆధార్ నమోదు చేయించారు. జన్మించిన కొద్ది నిమిషాలకే ఆధార్ పొందడం ఇదే అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు. ఉస్మానాబాద్ జిల్లా మహిళా ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం 12.03 గంటలకు పాప జన్మించగా, 12.09 నిమిషాలకు పాప తల్లితండ్రులు ఆమె బర్త్ సర్టిఫికెట్ను, ఆధార్ నెంబర్ను ఆన్లైన్ నుంచి పొందారని జిల్లా కలెక్టర్ రాధాకృష్ణ గమే తెలిపారు.
నవజాత శిశువు, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇది ఉస్మానాబాద్కు గర్వకారణమని, త్వరలో పిల్లలందరినీ ఆధార్కు రిజిస్టర్ చేసి వారి తల్లితండ్రుల ఆధార్ కార్డులతో లింక్ చేస్తామని చెప్పారు. ఉస్మానాబాద్ ఆస్పత్రిలో గత ఏడాదిగా జన్మించిన 1300 మంది పిల్లలకు ఆధార్ నెంబర్లు వచ్చాయని వెల్లడించారు.
Tags